గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష
తిరుపతి 26 అక్టోబరు 2021 ;తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం రాత్రి సమీక్ష జరిపారు.
గో మహా సమ్మేళనానికి హాజరవుతున్న స్వామీజీలు, మఠాధిపతులు, రైతులకు వసతి, ఆహారం, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఈఓ ఆదేశించారు.
వసతి ప్రాంతాల నుంచి మహతి ఆడిటోరియంకు, తిరుమలకు రవాణా సదుపాయం కల్పించడానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలని రవాణా విభాగం జీఎం ను ఆదేశించారు. మహతిలో కార్యక్రమాలను ఎస్వీబీసీ స్లాట్ ను బట్టి లైవ్ ఇవ్వాలని, యు ట్యూబ్ లో పూర్తి లైవ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి,జెఈఓ శ్రీ వీర బ్రహ్మం, సివిఎస్ఓ,శ్రీ గోపీనాథ్ జెట్టి, గోశాల డైరెక్టర్,శ్రీ హరినాథ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది
Source link
The post TTD EO REVIEWS GO Maha Sammelan Arrangments _ గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష appeared first on Tirupati Darshan Details.