తెలంగాణలో ఈ నెల 9న భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. మంత్రి హరీశ్ రావు (TS Minister Harish Rao) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. లోడ్ షేడ్ సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు
నిరుద్యోగ యువతీ, యువకులకు లాజిస్టిక్ డోర్ డెలివరీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad) లోడ్ షేర్ సంస్థ ప్రతినిధి భరత్ తెలిపారు. స్త్రీ, పురుష భేదం లేకుండా 7వ తరగతి, ఆ పై విద్యార్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని వారు సూచించారు.
సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ సదవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 35 ఏళ్లలోపు స్త్రీ, పురుషులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్, డ్రైవింగ్ లైసెన్సు తదితర వివరాలతో 9వ తేదీన ఉదయం 9 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.