నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని మంత్రి అయ్యే ఛాన్సేలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పొత్తులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావాలంటే బిజెపికి 230 సీట్లు రావాలని..అది జరిగే పనికాదన్నారు. మోడీ విధానాలనే తప్ప..తాను మోడీకి వ్యతిరేకం కాదన్నారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ లో సంపాదకులతో సమావేశం అయ్యారు. పెళ్ళి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన పెళ్లి కాంగ్రెస్ తో అయిపోయిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
Related Articles
ఏపీ, తెలంగాణాల్లో పొత్తులపై స్థానిక నాయకత్వాలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలసి వెళతామని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చితీరుతుందని..అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో అలాంటి ఛాన్స్ ఏ మాత్రం లేదన్నారు. మోడీ సర్కారు మీడియాపైనా ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here