బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఫోటో ఒకటి దుమారం రేపుతోంది. అదీ అస్సాం అసెంబ్లీలో. అస్సాం అసెంబ్లీకి..ప్రియాంక చోప్రా ఫోటోకు సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు విషయం. అస్సాం ప్రభుత్వం పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక చోప్రాను నియమించుకుంది. అందులో భాగంగా క్యాలెండర్ సిద్ధం చేశారు. అందులో ఫోటోపై కొంత మంది ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా డ్రెస్ అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా?. నటీమణులు పద్ధతైన దుస్తుల్లో కనిపించాలే తప్ప.. ఇలా అర్ధనగ్న ప్రదర్శనలకు దిగటం ఏంటి? అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎమ్మెల్యేలు నందితా దాస్, రుప్జ్యోతి కుర్మిలు అసెంబ్లీలో చర్చ లేవనెత్తి వెంటనే ప్రియాంకను అంబాసిడర్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
Related Articles
ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీనిపై అస్సాం పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా వివరణ ఇస్తూ ప్రియాంకను వెనకేసుకొచ్చారు. ‘కాంగ్రెస్ చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోంది. అసలు ఆ ఫోటోల్లో అసభ్యత ఎక్కుడుందో తెలీటం లేదు. ఏదైనా సంప్రదాయక వేడుకలు జరిగినప్పుడు ధోవతి, చీరలు అంటూ అంతే పద్ధతితో కనిపించాలి. కానీ, ఇది పర్యాటక శాఖకు సంబంధించిన అంశం. విదేశీయులు కూడా వస్తుంటారు. అలాంటి వారికి ఆహ్వానం ఆకర్షణీయంగా ఉండాలి. చీరల్లో పిలిస్తే ఎవరూ రారు. అయినా అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుంది’ అంటూ తెలిపారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here