ఆయన ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. కానీ ఆయన గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ సర్వీస్ అధికారి (టీడీపీ) గా మారిపోయారు. ఏపీ ప్రభుత్వంలో ఆయన ప్రస్తుతం ‘ముఖ్య’ పాత్ర పోషిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే అవాక్కయ్యే పరిస్థితి ఉంది ఆయన తీరు చూసి. అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు మూడు అధికార కేంద్రాలు తయారయ్యాయని చెబుతున్నారు. అందులో ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే..రెండవది సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ ది. మూడవ అధికార కేంద్రం ఐఏఎస్ ..సారీ టీడీపీ సర్వీసు అధికారిదే అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆయన వ్యవహారం మరీ శృతి మించుతోందని..పార్టీ వ్యవహారాల్లో ఆయన తలదూర్చుతున్నారని కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు తాజాగా యువనేతకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయి..ఏదన్నా ఉంటే సీఎంకు చెప్పాలి..లేదంటే నాకు చెప్పాలి కానీ మధ్యలో ఆయన రోల్ మరీ ఎక్కువైపోతుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కూడా ‘గ్యాప్’ పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన పోస్టుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర ఉండాల్సిందే.
Related Articles
అందుకే నిత్యం ఆయన ఛాంబర్ నిండిపోయి ఉంటుందని….సచివాలయంలో ఏ మంత్రి దగ్గర కూడా ఉండనంత మంది ఆయన దగ్గర మాత్రం కన్పిస్తారని ఓ నేత వ్యాఖ్యానించారు. జిల్లాల్లో అధికారుల మార్పు దగ్గర నుంచి..రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆయన తలదూర్చుతున్నారని అంటున్నారు. అయితే యువనేతకు ఈ తీరు ఏ మాత్రం నచ్చటంలేదని సమాచారం. ఆ ఐఏఎస్ మరీ అంత శక్తివంతమైన అధికార కేంద్రంగా మారటం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంత మంది నేతల వాదన మాత్రం భిన్నంగా ఉంది. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు..నేతలకు అటు సీఎం చంద్రబాబు..ఇటు మంత్రి లోకేష్ కూడా అందుబాటులో ఉండటంలేదని..అందుకే చాలా మంది అందుబాటులో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే అదనుగా ఆయన తన ‘హవా’ను అన్ని రకాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.
The post టీడీపీ సర్వీస్ అధికారిగా సీనియర్ ఐఏఎస్! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here