బతుకమ్మ చీరల విషయంలో సర్కారు చెప్పిందొకటి..చేసింది మరొకటి. అక్కడే అసలు సమస్య వచ్చింది. ముఖ్యమంత్రి కెసీఆర్ మొదలుకుని..మంత్రి కెటీఆర్ వరకూ గత కొన్ని రోజులుగా బతుకమ్మ సందర్భంగా తెలంగాణలోని ఆడపడుచులకు ఉచితంగా నేత చీరలు ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఆశించారు. ఒకటి కష్టాల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవటం ఒకెత్తు అయితే..పండగకు మహిళలకు చీరలు ఇవ్వటం ద్వారా వారి ఆదరణ పొందవచ్చనేది సర్కారు వ్యూహాం. వారి ప్లాన్ బాగానే ఉంది కానీ..అమల్లోకి వచ్చేసరికి అసలు సమస్య మొదలైంది. పలు జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీ సాగినా..చాలా చోట్ల సిల్క్ చీరలు..అతి తక్కువ ఖరీదువి పంపిణీ చేయటంతో పెద్ద దుమారమే చెలరేగింది. పలు చోట్ల మహిళలు చీరలను తగలబెట్టడంతో పాటు…ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైనా తీవ్ర విమర్శలు చేశాయి. ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
Related Articles
సమస్య అంతా నేత చీరలు అని చెప్పి చీప్ చీరలు మహిళలకు ఇవ్వటంతోనే సమస్య మొదలైంది. అసలు చీరల పంపిణీ కార్యక్రమం తలపెట్టిందే తెలంగాణలోని చేనేత పరిశ్రమను ఆదుకోవటానికి అని చెప్పారు. మరి అలాంటప్పుడు సూరత్ నుంచి చీరలను తెప్పించి ఇవ్వటంలో ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. ప్రభుత్వం చీరల పథకంపై ప్రకటన చేసినప్పుడు ఎక్కడా సూరత్ చీరల గురించి ప్రస్తావించలేదు. ఈ పథకానికి సంబంధించిన అమలు విషయంలో ఎన్నో లోపాలు ఉంటే..మంత్రి కెటీఆర్ మాత్రం మీడియాపై విరుచుకుపడుతున్నారు. చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్దవి చేసి చూపొద్దని హితవు పలికారు. అంతే కాదు..ప్రశ్నలు అడిగిన విలేకరులను కూడా ‘ఎవరు చెప్పారు నీకు’ అంటూ ఎదురుదాడి చేశారు.
The post టీఆర్ఎస్ సర్కారు చెప్పిందొకటి..చేసిందొకటి appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here