Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమరావతిలో 18 రెడిడెన్షియల్ టవర్లు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజదాని అమరావతిలో ఎట్టకేలకు నిర్మాణ సందడి మొదలైంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలు అక్కడకు వరస పెట్టి వస్తుండగా..సర్కారు కూడా రంగంలోకి దిగింది. శాసనసభ్యులు..శాసనమండలి సభ్యులతో పాటు  ప్రభుత్వంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎఎస్) అధికారులకు ఇక్కడ నివాస సదుపాయం కల్పించనున్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్ డీఏ) శనివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18 టవర్లలో 432 అపార్ట్ మెంట్ యూనిట్లను నిర్మాణ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది.  ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 608 కోట్ల రూపాయలుగా  టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ డిజైన్ కన్ స్ట్రక్షన్ విధానం కింద ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థలు సెప్టెంబర్ 16వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించారు.

                               ఈ నిర్మాణాలు ప్రారంభం అయితే ఒక్కసారిగా అమరావతి లో ఛల్ చల్ ఫ్రారంభం అయ్యే అవకాశం ఉంది. మోనోలితిక్ కాంక్రీట్ కన్ స్ట్రక్షన్ పద్దతిలో ఈ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒక్కో అపార్ట్ మెంట్ వ్యయం సుమారు కోటిన్నర రూపాయలుగా పడుతుంది. ఇదిలా ఉంటే సీఆర్ డీఏ వీటితోపాటు రాజధాని ప్రాంతంలో స్టార్ హోటళ్ళ నిర్మాణానికి కూడా ఆసక్తి ఉన్న సంస్థల నుంచి నోటిఫికేషన్లు ఆహ్వానించింది. అందులో రెండు ఫైవ్ స్టార్, రెండు ఫోర్ స్టార్, నాలుగు త్రీస్టార్ హోటళ్ళ నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించారు.

The post అమరావతిలో 18 రెడిడెన్షియల్ టవర్లు appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

అమరావతిలో 18 రెడిడెన్షియల్ టవర్లు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×