తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్ భూ స్కామ్ మొదలుపెట్టుకుని..డ్రగ్స్ అంశం వరకూ కెసీఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన రేవంత్..తాజాగా ఇసుక అంశాన్ని లేవనెత్తారు. ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా కేసీఆర్ కుటుంబా నికి రోజుకు కోటి రూపాయలు ముడుపులుగా అందుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సిరి సిల్లలో పోలీసుల దాడికి గురైన వారి కుటుంబసభ్యులు రేవంత్రెడ్డిని సోమవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ ఇసుక క్వారీలు అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఎలా దక్కుతాయని ప్రశ్నించారు.
Related Articles
వారి ఇసుక అక్రమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికే ప్రశ్నించిన దళితులపై పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల కేసులో టీఆర్ఎస్ నేతలకు, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులకు అనుకూలంగా విచారణ జరుగుతున్నదని రేవంత్రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బావమరిదికి చెందిన పబ్, సీనియర్ మంత్రి కుమారుని పబ్ నిబంధనలకు విరు ద్ధంగా నడుస్తున్నాయని, ఈ విషయం సీఎం కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. వీటిపై కేంద్ర హోంమంత్రికి, గవర్నర్కు ఫిర్యాదుచేస్తామని రేవంత్ తెలిపారు.
The post ఆ ఫ్యామిలీ ఆదాయం రోజుకు కోటి appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here