కేంద్ర మాజీ మంత్రి…ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడి కుటుంబ సభ్యులు నిర్వహించే ‘స్వర్ణభారతి’ ట్రస్ట్ కు టీఆర్ఎస్ సర్కారు రెండు కోట్ల రూపాయల మేర ‘మినహాయింపు’ కల్పించింది. అంతే కాదు..సదరు జీవోను కూడా రహస్యంగా పెట్టింది. ఈ మేరకు ‘హిందు’ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) స్వర్ణ భారతి ట్రస్ట్ కు వివిధ మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మునిసిపల్ శాఖ జూన్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ జీవోను మాత్రం రహస్యంగా పెట్టారు. ఈ జీవో ప్రకారం దీపా వెంకట్ కు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ కు 2,20,76,922 కోట్ల మేర డెవలప్ మెంట్ ఛార్జీలు, లేఔట్ ఛార్జీలు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు మినహాయింపు ఇచ్చారు. శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ గ్రామంలో 36,143.5 స్వ్కేర్ మీటర్ల లో భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది మార్చిలోనే దీపా వెంకట్ తమకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు.
Related Articles
ఈ ట్రస్ట్ భవనంలో ‘స్కిల్ డెవలప్ మెంట్, ట్రైనింగ్ తోపాటు పేదలకు వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. అయితే హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మాత్రం డెవలప్ మెంట్ ఛార్జీలతోపాటు ఇతర ఛార్జీల మినహాయింపు ఇచ్చే వెసులుబాటు లేదని ..మరిన్ని వివరాలు కోరారు. అదే సమయంలో ట్యుటోరియల్ బిల్డింగ్ కు 2.46 కోట్ల రూపాయల మేర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని..పేర్కొనగా..మినహాయింపులు అన్నీ పోగా 26 లక్షలు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో స్వర్ణభారతి ట్రస్ట్ కు 2.20 కోట్ల రూపాయల మినహాయింపులు దక్కాయి. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్జీవోలకు రాయితీలు ఇచ్చిన చరిత్ర కూడా లేదని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.
The post వెంకయ్య కూతురి ట్రస్ట్ కు టీఆర్ఎస్ సర్కారు 2 కోట్ల మినహాయింపు appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here