నవంబర్ 19న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
తిరుపతి, 2021 నవంబరు 14: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబర్ 19వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
అదేవిధంగా నవంబరు 22వ తేదీన బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలో, నవంబర్ 29వ తేదీన విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో గల ఎంజీఎం మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపడుతోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Source link
The post TTD TO Observe Karthika Deepotsavams _ నవంబర్ 19న తిరుపతిలో కార్తీక దీపోత్సవం appeared first on Tirupati Darshan Details.