గవర్నర్ ను కలిసిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవిసుబ్బారెడ్డి
తిరుమల 2 నవంబరు 2021: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్ ను తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, 2022 సంవత్సరం క్యాలెండర్, డైరీలను బహుకరించారు.
కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం టీటీడీ చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధానాల గురించి గవర్నర్ కు శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల్లో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ పి సిసోడియా ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది
Source link
The post Chairman Meets Guv _ గవర్నర్ ను కలిసిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవిసుబ్బారెడ్డి appeared first on Tirupati Darshan Details.