నవంబరు 9న మిక్సిడ్ రైస్ టెండర్ మరియు వేలం
తిరుపతి, 2021 అక్టోబరు 22: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను నవంబరు 9వ తేదీన టెండర్ మరియు వేలం వేయనున్నారు.
ఇందులో మిక్సిడ్ బియ్యం 11,040 కేజిలు టెండర్ మరియు వేలంలో ఉంచనున్నారు.
ఆసక్తి గలవారు నవంబరు 9వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ. 3,000/- డిడి తీసి సీల్డ్ టెండర్తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్సైట్ www.tirumala.org సంప్రదించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
Source link
The post నవంబరు 9న మిక్సిడ్ రైస్ టెండర్ మరియు వేలం – Ttd News appeared first on Tirupati Darshan Details.