Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అంతర్వాహిని..సరస్వతి నది

అంతర్వాహిని..సరస్వతి నది 

సరస్వతి నది వేదాలలో వర్ణించబడిన ఓ పురాతనమైన నది. ఈ నది అసలు భారతదేశంలో లేదని కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే సరస్వతి నదీ భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని రుజువులు దొరికాయి.




4000 BC లో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైందని, ఎండిపోయిన సరస్వతి నది గర్భం చిత్రాలు మొదలైనవాటిని శాటిలైట్ స్పాట్ ద్వారా బయటపెట్టారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీనాల్ ఫ్రాంక్ ఫోర్ట్. వీరి పరిశోధనల ప్రకారం రుగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది, దాదాపు 4వేల ఏళ్ల క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం.

'); }());  సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద, యమునా నదితో పాటు ఉద్భవించి.. ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, రాష్ట్రాల మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని రుజువైంది.
 యమున, సరస్వతి.. కొద్దిదూరం సమాంతరంగా ప్రవహించి తరువాత యమునానది సరస్వతినదిలో కలిసేది. యమునతోపాటు సట్లెజ్, హక్రా, షుగ్ఘర్ మొదలైన నదులు హిమాలయాల్లో జన్మించి, కొద్దిదూరం ప్రవహించి.. సరస్వతినదిలో కలిసేవి. పురాణాలు ఆధునిక పరిశోధనలు ఈ రెండు విషయాలను ధృవపరుస్తున్నాయి.


సరస్వతినది ఎండిపోవడానికి కారణం భూమియొక్క టెక్టోనిక్ ప్లేట్స్ లో వచ్చిన మార్పులేనట. ఈ మార్పుల వల్ల ఆరావళీ పర్వతాలు పైకి జరిగాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది.
ఈ కారణాల చేత సరస్వతి నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి.. కొంతకాలానికి భూమిపైన ప్రవహించకుండా.. భూమి అడుగుభాగంలో అంతర్వాహినిగా మారిపోయింది. రుగ్వేదంలో సరస్వతి నదీ యొక్క వర్ణన కేవలం నదిరూపంలోనే కాక చదువులతల్లి వాణిగా.. వర్ణించబడింది.
గంగానది లాగే ఈ నదీ తీరంలో అనేక తీర్ధస్థలాలు విలసిల్లాయి. మహాభారతం, స్కంద పురాణం, పద్మపురాణం, దేవీభాగవతాలలో ఈ నది యొక్క వర్ణన ఉంటుంది. 


This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

అంతర్వాహిని..సరస్వతి నది

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×