సాలగ్రామ నిలయం..గండకీ నది !!!
గండకీ నది నేపాల్ లోని ముక్తినాథ్ కు కొంచెం ముందుగల దామోదర్ కుండం నుండి బయలుదేరుతుంది.ఈ నదీ క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారయ్యే విభిన్న రూపాలలో గల సాలగ్రామ శిలలు లభ్యమయ్యాయి.. మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ముక్తినాధ్ వద్ద, గండకీ తీరంలో నివసిస్తుంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని సాలగ్రామం అని కూడా వ్యవహరిస్తారు.
Related Articles
ఈ నది లో దొరికే సాలగ్రామ శిలల అంతర్భాగంలో శంఖు చక్రాలు, శివలింగం, త్రిశూలం.. మొదలైన హిందూ దేవతల చిహ్నాలు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం సతీ తులసి శాపం వలన శ్రీమహావిష్ణువు శిలాకృతి దాల్చాడని, శిల అంతర్భాగం పురుగులు దొలిచే శాపం ఉందనీ ఒక నమ్మకం.
ఈ సాలగ్రామాల మహత్యం, విష్ణుపురాణంలో వివరించారు. వీటికి ప్రతీ రోజూ, అభిషేకం, పూజ చేస్తే ఇహపరాలు రెండూ లభ్యమవుతాయని ఒక నమ్మకం. గండకీ నది తీరంలో విలసిల్లిన ముక్తినాథ్ ప్రముఖ శక్తిపీఠం. ప్రస్తుతం ఆ దివ్యమందిరం ఉన్నచోట సతీదేవి యొక్క చెక్కిలి పడినట్లు చెబుతారు. అందుకే ఈ నది గండకీ పేరుతో పిలవబడుతోంది. ఈ నది బీహార్ లో ప్రవేశించి గంగానదిలో కలుస్తుంది