కృష్ణవంశీ అనగానే ఆయనో పిచ్చి డైరెక్టర్ అనేవాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఆయన తనకు నచ్చిన సినిమాని తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకుంటారే తప్ప ప్రస్తుతం సక్సెస్ కోసం మసాలా యాంగిల్స్ వాడి కమర్షియల్ బాటలో అందరిలా మూస ధోరణిలో వెళ్ళే పద్ధతికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకే. అందుకే కెవిని చాలామంది ఆయనో పిచ్చి డైరెక్టర్ అంటుంటారు. ఇదే విషయాన్ని నక్షత్రం సినిమా నిర్మాత శ్రీనివాసులు ఆడియో ఫంక్షన్లో బయటపెట్టేశారు.
Related Articles
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నక్షత్రం`. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆడియో సీడీలను సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ విడుదల చేసి తొలి సీడీని రెజీనా, ప్రగ్యా జైశ్వాల్కు అందించారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – “గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ సమయంలో రాంచరణ్ అన్నను కలవడానికి వెళ్లినప్పుడు కృష్ణవంశీగారికి కలిసి మీ సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉన్నా చెప్పండి సార్ చేస్తానని అన్నాను. అలా వచ్చిన అవకాశమే అలెగ్జాండర్ క్యారెక్టర్. కృష్ణవంశీగారికి నా మనస్ఫూర్తిగా థాంక్స్. ఓ స్టూడెంట్ కాలేజ్కు వెళ్ళినట్లే వెళ్ళి నేర్చుకున్నాను. ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత చిరంజీవిగారికి, పవన్కళ్యాణ్గారికి చెప్పినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటావురా అన్నారు. సందీప్కిషన్, తనీష్, మానస్ అందరూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. నిర్మాతలు శ్రీనివాస్, వేణుగోపాల్, సజ్జగారికి థాంక్స్. భీమ్స్, హరిగౌర, భరత్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.
See Also: డీజే లొల్లి: యుద్ధం శరణం గచ్ఛామి
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఈ సినిమా చేయడం ఎంతో ఎగ్జయింట్గా ఉంది. వేణుగోపాల్గారిచ్చిన ధైర్యంతో సినిమా చేయగలిగాను. కృష్ణవంశీగారు ఇచ్చిన సపోర్ట్తో సినిమాను ఇక్కడ వరకు తీసుకురాగలిగాం. కృష్ణవంశీగారికి నా పాదాభివందనం. కృష్ణవంశీగారు ఆడియెన్స్ డైరెక్టర్. ఆడియెన్స్కు నచ్చే సినిమాలే చేస్తుంటారు. బయట కృష్ణవంశీగారితో సినిమా అనగానే ఆయనొక పిచ్చి డైరెక్టర్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను సినిమా పిచ్చోణ్ణే. కాబట్టే ఇద్దరి మధ్య ఏ సమస్యలు రాలేదు. కృష్ణవంశీగారిపై నమ్మకంతో సినిమా మొదలు పెట్టాం.
ముందు ఈ సినిమాలో సందీప్కిషన్, రెజీనా తప్ప పెద్ద స్టార్ కాస్ట్ లేదు. కానీ ఈరోజు ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నందుకు కృష్ణవంశీగారే కారణం. మహాభారతంలో అభిమన్యుడిలా ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేశారు. ఏదో చిన్న సినిమా అనుకున్నాం. ఈరోజు సినిమా ఇంత పెద్దదిగా మారడానికి కారణం, కృష్ణవంశీగారు, సాయిధరమ్తేజ్గారే కారణం. ఇంత పెద్ద సినిమాను చేయడంతో కడుపు నిండిపోయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నక్షత్రంలో కృష్ణవంశీగారు సాయిధరమ్ తేజ్, సందీప్కిషన్, రెజీనా, ప్రగ్యా ఈ అందరినీ కొత్త క్యారెక్టర్స్గా పరిచయం చేస్తున్నారు“ అన్నారు.
సందీప్కిషన్ మాట్లాడుతూ – “నేను హైదరాబాద్కు వచ్చి తొమ్మిదేళ్ళు అయ్యింది. ఏడేళ్లకు ముందు నేను కృష్ణవంశీగారిని కలవాలని ఆయనకు ట్విట్టర్లో మెసేజ్ పెట్టాను కానీ ఆయన ఏం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నేను నా సినీ ప్రయాణంలో మూడు రిలేషన్స్ను సంపాదించుకున్నాను. ఆ మూడు ఈ సినిమాలో కనపడుతున్నాయి. అందులో సాయిధరమ్తేజ్ ఒకడు. నా బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ బెస్ట్ఫ్రెండ్ రెజీనా. ఇప్పుడు కృష్ణవంశీగారు. ఈ సినిమా కృష్ణవంశీగారు ఎవరితోనైనా చేసుండవచ్చు. ఆయన ఎక్కడో నాపై నమ్మకం ఉంచారు. ఈరోజు ఆ నమ్మకానికి నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నిర్మాతలు మమ్మల్ని ఎంతో నమ్మారు. తనీష్ ఈ సినిమాలో ఇరగదీశాడు. కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకునే కల మా యూనిట్లో చాలా మందికి తీరింది“ అన్నారు.
See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు
The post కృష్ణవంశీ పిచ్చి డైరెక్టర్ అన్న వాళ్ళు ఎందరో..! appeared first on .