Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సహచరుల అంగాలు అమ్ముకుని బ్రతికే రాక్షసులకు , శాంతి వచనాలు రుచిస్తాయా గురూజీ !!?

                                                                               



                     ఈ  మద్య మన హైదరాబాద్ నుంచి కొంత మంది ముస్లిం యువకులు , అంతర్జాతియ ఉగ్రవాద  సంస్త అయిన ISIS పట్ల ఆకర్షితులై అందులో చేరి తమ మతాభిమానం చాటుకోవడానికి ఏగేసుకు పోతున్నారట. అటువంటి వారికి ఒక శుభ వార్త! ప్రస్తుతం ISIS ఉగ్రసంస్త నిదుల లేమితో కష్టాల్లో ఉందట! పాపం అందుకనే  తమ సహచరులు ఎవరైనా పోరాటం లో గాయపడితే , వారు బ్రతికి ఉండగానే వారి శరీర అంగాలు తొలగించి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారట. కాబట్టి ఎవరైనా ఒత్సాహికులు బ్రతికి ఉండగానే తమ అంగాలను కోయించుకోవాలని ఉబలాటపడుతుంటే నిరబ్యంతరంగా ఆ సంస్తలో జాయిన్ కావచ్చు!.

   పూర్వకాలం లో రాక్ష జాతి ఒకటి ఉండెది అని మన పురాణాలు చెపుతుంటే , అవి పుక్కిటి పురాణాలు అని ఎద్దేవా చేసే వారు ఉన్నారు. అటువంటి వారికి ఆ రాక్షస జాతి వారసులు " మేమున్నాం ,ఇది నిజం" అని తమ చేష్టల ద్వారా రుజువు చేస్తున్న ISIS సంస్త సబ్యులను చూసి తెల్లముఖాలు వేయాల్సిందే! యుద్దాలలో పట్టుబడిన స్త్రీలను  సెక్స్ బానిసలుగా అమ్మి సొమ్ము చేసుకోవడం, యుద్దాలలో గాయపడిన సహచరులకు మందులు ఇచ్చి నయం చేసే బదులు, వారి అంగాలను తొలగించి , అంతర్జాతియ హాస్పిటల్స్ కి అమ్మి కోట్లు సంపాదించడం లంటి పనులు మనుషులు అన్న వారు ఎవరైనా చేస్తారా? ఒక్క రాక్షసులు తప్పా? 

    ISIS ఉగ్రవాద సంస్త ఆదీనం లో ఉన్న మోసుల్ అనే నగరం ఇరాక్ లో ఉన్న నగరాల్లో మూడవ పెద్ద నగరం అట.  ఇటివల ఈ నగరం కోల్పోవడం వలన వారు తీవ్ర ఆర్దిక నష్టాల్లో ఉన్నారట. దానిని పూడ్చుకోవడానికి వారు చేస్తున్న అకృత్యాలు వింటుంటే  ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మరణ శిక్షలు పడిన ఖైదీలకు , శిక్ష అమలు చేయకుండా   జైలులోనే ఉంచి , వారి రక్తం తీసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారట. అలగే సహరుల అంగాలు కూడా. బ్రతికి ఉన్న వారి అంగాలను తొలగించడానికి అంగీకరించని డాక్టర్ లు 150 మందిని కాల్చి చంపారు అంటె వారిలో ఉన్న దానవత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే!. 
                                                                 

   
                           మరి అటువంటి రాక్షసులకు సుద్దులు చెప్పి మనసు మారుద్దాం అని సంకల్పించారు అట మన దేశం లోని "ఆర్ట్ అప్ లివింగ్ ఫౌండేషన్"  అదినేత  గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గారు. తానూ చెప్పే శాంతి సందేశాలు విని తన భక్తులు  అంతా శాంతి కాముకులు అవుతుంటె , ISIS ఉగ్రవాదులు మాత్రంఎందుకు కారు? వారికి చెప్పే వారు లేక చెడి పోయారు తప్పా చెప్పవలసిన విదంగా సామరస్యంగా కరుణ బోధలు  చెపితే , సినిమాలలో లాస్ట్ సీన్ లో విలన్ లు మాదిరి కళ్ళ నీరు పెట్టుకుంటూ , గురుజి గారు కాళ్ళు పట్టుకుని "క్షమించండి స్వామీ, ఇన్నాళ్ళు తమ బోటి గురువుల బోదలు  లేక పాపాలు చేసాం , ఇకనుంచి తుపాకులు  వదిలిపెట్టి, మీ ఆశ్రమం లో చేరి భజనలు చేస్తూ శేష జీవితం గడుపుతాం " అని అంటారని బావించినట్లు ఉంది. వెంటనే వారికి ఒక శాంతి సందేశం పంపారట. చేస్తున్న అమానవీయ పనులు వదిలివేసి ప్రశాంతంగా  బ్రతుకుడు అని. 

             మరి గురూజీ శాంతి సందేశానికి ప్రతి సమాదానం గా ISIS వారు ఏమి పంపారో తెలుసా? ఒక ఫొటొ ! ఆ ఫోటోలో తల లేని మొండెం ఉంది అట. దీని బావమేమి శంకరా అంటే , "ఇంకొక సారి ఇటువంటి సందేశాలు పంపావు అంటే మెడ కోసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాం " అని కాబోలు!. దీనితో గురూజీ గారికి జ్ఞానోదయం అయి వారికి మిలటరీ యాక్షన్ యే కరెక్టు , స్వాముల " శాంతి వచనాలు పనికి రావని సెలవిచ్చారు అట.పేపర్ వాళ్ళకి అయన చెప్పినడి అయన మాటల్లోనే “I tried to initiate peace talks with the ISIS (Islamic State of Iraq and Syria) recently but they sent me a photograph of a beheaded body of a man. Thus, my effort for a peace dialogue with the ISIS ended. I think the ISIS does not want any peace talks . Hence, they should be dealt with militarily.” 
             
             పాపం గురూజీ గారికి పరవస్తు చిన్నయ సూరి గారి కధలు చిన్నప్పుడు ఎవరూ చెప్పనట్లుంది . అందుకే అంత సాహసం చేసారు మరి ఆ కదా ఏమిటో తెలుసుకుందామా ?
                          బాగా చలిగా ఉండే  ఒకానొక చలికాలం లో రాత్రి వేళ ,కోతుల గుంపు ఒకటి వెచ్చగా ఎక్కడినా మంట ఉంటే చలి కాచ్కుందామని చూస్తుంది అట. వాటికి దూరం గా మిణుగురు పురుగుల సమూహం ఒకజాతి కనపడితే అది మంట అని బ్రమించి అక్కడికి వెళ్లి మిణుగురు పురుగుల చుట్టూ కూర్చుని చలి కాచుకోవడమ్ మొదలు పెట్టాయి  అట. ఇదంతా గమనిస్తున్న ఒక కాకి వాటికి జ్ఞానోదయం చేసి , నిజమైన మంట దగ్గరకు వెళ్ళేలా చేయాలి అనుకుందట. దానితో వాటి అ దగ్గరకు వెళ్లి "ఇవి మిణుగురు పురుగులు. వీటి వలన మీ చలి పోదు" అని చెపితే " చాలు చాల్లే ! పెద్ద చెప్పొచ్చావు ! ఏది మంటో ఏది కాదో మాకు తెలియదా " అని కసిరి పంపేసాయి అట కోతులు. దానితో ఆ కాకికి జ్ఞానోదయం కాక తిరిగి అదే పనిగా చెపుతుంటే , భరించలేక ఆ కోతులు కాకిని పట్టి చంపేసి "అమ్మయా పీడ విరగడైంది " అని అనుకున్నాయట. అదీ కదా . ఈ  కధలోని  నిటి ఏమిటంటె "మూర్కులకు జ్ఞానోదయం చేయడమంటే ముప్పు కొని తెచ్చుకోవడమే " . 

   పాపం! గురూజీ గారికి కాకి మాదిరి కాకుండా ఒక్క ఫొటొ కే జానోదయం అయినట్లు ఉంది. అందుకే "మిలటరి ఆపరేషన్ " తోనే ఉగ్రవాద పరేషాన్ కి పరిష్కారం దొరుకుతుంది అని సెలవిచ్చారు . 
  
     


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

సహచరుల అంగాలు అమ్ముకుని బ్రతికే రాక్షసులకు , శాంతి వచనాలు రుచిస్తాయా గురూజీ !!?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×