Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక బంధు పథకం. ఆ బంధు, ఈ బంధు ,రాబందు పథకాలు..

Tags: agravedeg

 ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ లో పాలకులకు ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికలు అయిపోగానే  ఏ ఒక్కడు ప్రజల గురించి పట్టించుకోడు. వీళ్ళకు కావలసింది ప్రజల ఓట్లు మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వారితో ఓటు వేయించుకోవాలి అని ఆలోచించి ఏవో కొన్ని పథకాలు ప్రవేశపెడతారు. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దలితబంధు అనే పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న దలితులందరికి పదిలక్షలు ఇస్తాం అన్నారు. ఆ పథకం ఏమైంది ఎక్కడో కొద్ది మందికి అదికూడా అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఏమి అర్థం అవుతుందంటే ఏదో ఒక హామీ ఇస్తే జనాలు మనకు ఓటు వేస్తారు గెలిచికా ఎవడు అడిగేవాడు ఉండడు అడిగిన అధికారం మనది అనగదొక్కేస్తాం అనే ధీమా తో ఉంటారు మన పాలకులు..


 మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరో పథకం తెరపైకి వచ్చింది. ఆ పథకం పేరు బీసి బంధు అనుకుంటా. రాష్ట్రంలో ఉన్న బీసిలందరికి లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటించారు. ఇంకేముంది మన జనాలు తండోపతండాలుగా లక్ష రూపాయల పథకం కోసం,  ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జనాలు ఇలా ఉన్నారు కాబట్టే నాయకులు జనాలను గొర్రెల్లా భావించి ఆడుకుంటున్నారు. లక్ష రూపాయిలు ఇచ్చే పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతున్నారు. ప్రజల్లో చైతన్యం లేదు. నాయకుడు తన అధికారం కోసం ఏదో తాయిలం ఆశ చూపుతున్నాడని వెర్రి జనానికి అర్థం కాదు.

  

 దలితులకు పది లక్షలు ఇచ్చాడా, 

   రైతులకు రుణమాఫీ చేసాడా, 

   డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాడా, 

   నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా,

   ప్రతీ ఎకరానికి సాగునీరు ఇచ్చాడా.

   

ఇన్ని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఏ హామీ నేరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే మళ్లీ కొన్ని తాయలాలు ఆశచూపి మళ్ళీ అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని దోచుకోవాలి...


జనాలు ఈ హామీల గురించి పశ్నించరు. లక్ష రూపాయిల పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతారు. నిజంగా లక్షరూపాయలతో మీ జీవితంత  మారిపోతుందా ఆలోచించండి. సరే లక్ష్ రూపాయలతో జీవితంలో పైకి వస్తాం అంటే ఆ లక్ష రూపాయలు అందరికి ఇస్తాడా మరీ... మన రాష్ట్రంలో జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక నలబై లక్షల కుటుంబాలు బీసీ కుటుంబాలు ఉన్నాయనుకుంటే 40 లక్షలు× 1లక్ష=40 వేల కోట్లు ఎక్కడ నుండి వస్తాయి. 


ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ బంధు,ఈ బంధు, రాబందు అని కొత్త కొత్త తాయిలాలతో జనాలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకుని గెలిచినాక ఏ ఒక్క నాయకుడు జనాలను పట్టించుకున్న పాపాన పోడు..


కాబట్టి మనకు కావలసింది ఇలాంటి పనికి మాలిన తాయిలాలు, నేరవేర్చాలేని హామీలు కాదు. మనకు కావలసింది నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం. ఇవి చాలు అంతే.. పనికిమాలిన బంధులు అవసరం లేదు. విద్య , వైద్యం కోసమే సామాన్యుడు తాను సంపాదించిన దాంట్లో ఎక్కవగా ఖర్చు చేస్తున్నాడు, అప్పుల పాలు అవుతున్నాడు.


రాజకీయ నాయకుడెవడు ప్రజల అభివృద్ధి కోరుకోడు. వాడికి కావలసింది అధికారం అంతే. అందుకోసం ఏవో కొన్ని పథకాలు అని డబ్బు ఆశచూపి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తాడు. ఆ తర్వాత తరతరాలకు తరగని సంపద పోగేసుకుంటాడు.. 


మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పథకం అని డబ్బు ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు.. గెలిచాక హామిలుండవు ఆవకాయ ఉండదు. ఎన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించాలి, ఎన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాలి ఈ ఐదు ఏళ్ళలో అని దోచుకునే పనిలో బిజీ అయిపోతారు. ఐదు ఏళ్ళ వరకు అందిన కాడికి దోచుకుంటారు...


వీళ్ళకు ప్రజల కష్టాలు తెలియవు. ప్రజలను ఓటు బ్యాంకు గానే చూస్తారు అంతే తప్పా మనుషులుగా చూడరు. ఇలాంటి వారిని గెలిపిస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే.. 


మరీ ఎవరిని గెలిపించాలి అంటే రాజకీయ నాయకులు అంటేనే దోపిడి.. ఈ పార్టీ ఆపార్టీ అని తేడా ఉండదు. అందరూ అందరే. 


ఈ దోపిడిని ఆపి ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి....



This post first appeared on My Porsonal, please read the originial post: here

Share the post

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక బంధు పథకం. ఆ బంధు, ఈ బంధు ,రాబందు పథకాలు..

×

Subscribe to My Porsonal

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×