కోల్కతా నైట్రైడర్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాజయానికి కోల్కతాను వారి ఇలాఖాలోనే కోహ్లీసేన మట్టికరిపించింది. సోమవారం ఏకపక్ష రీతిలో సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గంభీర్సేనపై ఘనవిజయం సాధించింది. దీంతో ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ఐదో స్థానంలో నిలిచింది. కోల్కతా నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు వికెట్ నష్టపోయి 18.4 ఓవర్లలోనే 186 పరుగులు చేసింది. తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ కెప్టెన్ కోహ్లీ(51 బంతుల్లో 75నాటౌట్, 5ఫోర్లు, 3సిక్స్లు), డివిలియర్స్(31 బంతుల్లో 59నాటౌట్, 5ఫోర్లు, 3సిక్స్లు) అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో బెంగళూరు అలవోక విజయాన్ని అందుకుంది. నారాయణ్(1/34)కు ఏకైక వికెట్ దక్కింది. అద్భుత ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాజయానికి కోల్కతాను వారి ఇలాఖాలోనే కోహ్లీసేన మట్టికరిపించింది. సోమవారం ఏకపక్ష రీతిలో సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గంభీర్సేనపై ఘనవిజయం సాధించింది. దీంతో ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ఐదో స్థానంలో నిలిచింది. కోల్కతా నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు వికెట్ నష్టపోయి 18.4 ఓవర్లలోనే 186 పరుగులు చేసింది. తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ కెప్టెన్ కోహ్లీ(51 బంతుల్లో 75నాటౌట్, 5ఫోర్లు, 3సిక్స్లు), డివిలియర్స్(31 బంతుల్లో 59నాటౌట్, 5ఫోర్లు, 3సిక్స్లు) అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో బెంగళూరు అలవోక విజయాన్ని అందుకుంది. నారాయణ్(1/34)కు ఏకైక వికెట్ దక్కింది. అద్భుత ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Read For More News: visit Namaste Telangana Online Newspaper