దైవేశ్చ అంటే ఇలా ఉంటుంది
అద్భుతమైన కథ చదవండి మరి
వీధులు రోజు ఊడ్చే ఒక వ్యక్తికి రోజూ పని చేసి చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఓ గుడి దగ్గర మెట్లపైన కూర్చుండి ప్రతి రోజూ ఓ దేవుడా....
Related Articles
"నువ్వైతే చక్కగా రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమో...
ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి స్వామి నీ పనిని నేను చేస్తా" అని దేవుడితో మొరపెట్టుకునేవాడు, అయినా దేవుడు ఏమీ స్పందించలేదు రోజూ ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసిగిపుట్టి,
నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకి గనక ఉంటే ఈపాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు.
దేవుడు కూడా ఇతని మాటలు రోజు వినీ.. ఓ రోజు సరేనన్నాడు, నా పని నువ్వు చెయ్యి... నీ పని నేను చేస్తా..
కానీ ఒక్క షరతు అన్నాడు దేవుడు, షరతు ఏమిటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం స్పందించ కూడదు, నోరు విప్పకూడదు." అన్నాడు దేవుడు.
"సరే సరే" అన్నాడు మనోడు.
తెల్లారే సరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
కాసేపటికి ఓ ధనిక భక్తుడు అక్కడికి వచ్చాడు.
"దేవుడా... నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా బాగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూసుకోకుండా వెళ్లిపోయాడు.
మనోడు
"ఒరేయ్... పర్సు వదిలేశావు రా చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు పెట్టిన షరతు గుర్తుకు వచ్చి ఉండిపోయాడు .
ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించు కుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు.
కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా స్వామి.. నయనా" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
"ఒరేయ్ దొంగా ఆ పర్స్ నీది కాదురా.... అని గట్టిగా అరుద్దామనుకున్నాడు మనోడు. మళ్లీ షరతు గుర్తుకొచ్చింది.
ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
"దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ నువ్వే" అని వేడుకున్నాడు..
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో కలిసి అక్కడికి వచ్చాడు.
"నా పర్సు ఈ గదిలోనే ఇక్కడే పోయింది, నా తరువాత వచ్చింది ఇతడే...
కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు, పట్టుకొండి అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే, మనోడు సహించలేక పోయాడు ఇంకా...
ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు, దాంతో ఉండబట్టలేక పోయాడు. దేవుడు పెట్టిన షరతు మర్చిపోయాడు, వెంటనే
"ఒరేయ్ ఆగండ్రా... ఈ నావికుడు నిర్దోషి రా... పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు వాడు ఒక పేదవాడు పర్సును తీసుకెళ్లాడు" అని అరిచేశాడు.
దేవుడే చెబుతుంటే, ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని అక్కడే వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.
సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడ తన అసలు డ్యూటీకి వచ్చేశాడు మరి...
"దేవుడా...
ఇవ్వాల నేను ఎంత మంచి పని చేశానో ..
నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను తెలుసుగా
ఒక దోషిని అరెస్టు చేయించాను" అన్నాడు మనోడు పెద్ద తోపులా...
"ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా... ఎందుకు ఇలా చేశావు" అని అడిగాడు దేవుడు ...
"అదేమిటి దేవుడా, మంచిపని చేసిన నన్ను
నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను" అన్నాడు కానీ ఇలా అంటున్నావ్ ఊడ్చేవాడు బాధగా....
అప్పుడు దేవుడు మాట్లాడుతూ "ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు"
వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచెం అయినా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను రా...
అలాగే ఆ పర్స్ లోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు కదా అన్నాడు.
ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు తెలుసా..
విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందులోని వారు అందరూ చనిపోతారు,
అదే నావికుడు అరెస్టై జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది వాడితో బాటు ఇంకొందరు ప్రయాణీకులు కూడా బతికిపోయేవారు కదా ఇదేమి నీకు తెలియదు..
ఇప్పుడు చూడు...
పేదోడు జైల్లో ఉన్నాడు.
ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు.
నావికుడు చావబోతున్నాడు.
ఎంత పని చేశావయ్యా నువ్వు...అన్నాడు దేవుడు.
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు...
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు కానీ...
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండవచ్చు మరి.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాతృలమైన మనకు సాధ్యం కాదు.
అందుకే ఏది జరిగినా మనమంచికే అంటుంటారు పెద్దలు
భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణ లో మనం ఉండాలి అంతే.... ఇక అన్ని ఆయనే చూసుకుంటాడు..
ధన్యవాదాలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.