కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యంత నీతి మంతుడిని అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోడీ బిజెపి నాయకుల ఇళ్ళలో పట్టుబడే నగదుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలే ఓ నాయకుడి ఇంట్లో 78 లక్షల రూపాయల నగదు దొరికిందని..ఇదంతా టీ అమ్మి సంపాదించిన డబ్బా? అని నిలదీశారు. మోడీ నుంచి తాము దేశభక్తి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేమన్నారు.
Related Articles
కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ పదే పదే బాలాకోట్ అంశాన్ని ప్రస్తావించటం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. సైనిక దళాలకు రాజకీయాలకు వాడుకుంటుంది బిజెపియే అని ఆరోపించారు. మోడీ ఓ అసమర్ధ ప్రధాని అని ఆరోపించారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here