Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వీరికి వ్యాపారాలే ముఖ్యం….

Tags: agravedeg

Four TDP MPs joined BJP where ED inquiries going on

  • నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలోకి జంప్
  • ఈడీ దాడుల ఎఫెక్ట్
  • చంద్రబాబు విదేశీ పర్యటన సమయంలో కీలక పరిణామం

మరో కొత్త నాటకానికి తెరలేచింది. వ్యాపారాలే ముఖ్యంగా ఉండే నలుగురు టీడీపీ ఎంపీలకు కొత్తగా బీజేపీపై… ముఖ్యంగా మోడీపై ప్రేమ పుట్టుకొచ్చింది. టీడీపీలో ఉన్నన్నిరోజులు బీజేపీని, మోడీని బండబూతులు తిట్టిన సీఎం రమేశ్‌లాంటి మహానాయకులు రాజ్యసభ పదవులను కట్టబెట్టిన  తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ కొట్టారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు వై. సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లు బీజేపీలోకి చేరిపోయారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో… అదను చూసుకుని ఈ నలుగురు ఎంపీలు పార్టీ మారిపోయారు.

బీజేపీలో చేరేందుకు అంగీకరించిన ఈ నలుగురు ఎంపీలను ఏ విధంగా పార్టీలోకి తీసుకోవాలన్న కోణంలో బీజేపీ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించింది. అందులో భాగంగా నలుగురు ఎంపీలతో చర్చలు జరుపుతూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దా… చివరికి రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాయాలని తీర్మానించారు.

ఆ మేరకు తాము నలుగురం బీజేపీలోకి చేరిపోతున్నామని తమను ఇకపై టీడీపీ ఎంపీలుగా కాకుండా బీజేపీ ఎంపీలుగా పరిగణించాలని వారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. అంతేకాకుండా రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో చేర్చాలని కూడా వారు తమ లేఖలో వెంకయ్యను కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు.

ఈడీ దాడుల ధాటికే బీజేపీలో వీళ్ళందరూ చేరిపోయారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పూర్తిగా అవకాశవాద రాజకీయాలకు ఈ నలుగురు తెరలేపారని, వీరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి నష్టంలేదని టీడీపీ చెబుతోంది.

-కెవిఎన్ఎల్ నరసింహారావు

The post వీరికి వ్యాపారాలే ముఖ్యం…. appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

వీరికి వ్యాపారాలే ముఖ్యం….

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×