GSTకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ వస్త్ర వ్యాపారులు సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.
Related Articles
జీఎస్టీ వల్ల తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపిస్తూ వస్త్ర వ్యాపారులు పోరుబాటపట్టారు. దీంతో వస్త్ర తయారీ పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. వస్త్ర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని నిరసిస్తూ వ్యాపారులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు.
ఇన్నేళ్ళు టెక్స్టైల్స్ను ప్రత్యేక ప్రాధాన్యంగల అత్యవసర సరుకుగా పరిగణించారు. ఇప్పుడు జీఎస్టీ కింద పన్ను విధిస్తే పరిశ్రమ వెన్నువిరుగుతుంది అని టెక్స్టైల్స్ ట్రేడర్స్ అసోసియేషన్ (టీటీఏ) చెబుతోంది.
ఇంతకాలం ఎటువంటి పన్ను చెల్లింపులేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రస్తుతం ఐదు శాతం పన్ను విధించారు. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధినిస్తున్న టెక్స్టైల్ రంగంపై జీఎస్టీని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. వచ్చే జీఎస్టీ కౌన్సిల్లో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక నిరసనలు చేపడుతామని హెచ్చరించింది.
See Also: జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం
The post సంగారెడ్డిలో జీఎస్టీ రగడ appeared first on .