తెలంగాణ సర్కారు జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కేసులు పెడుతోంది. ఒక్క వార్త తప్పు రాశాడని ఏకంగా ఆ జర్నలిస్టు అక్రిడేషన్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హెచ్ ఎండీఏ ఆఫీస్ ను తార్నాక నుంచి అమీర్ పేటకు మారుస్తున్నారని ఈనాడు పత్రికలో వార్త ప్రచురితం అయింది. అందులో నిజం లేదు. సహజంగా అయితే వివరణ ఇస్తారు. ఏ మాత్రం ఆధారం లేని వార్త కాబట్టి యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేయవచ్చు. కానీ ఏకంగా వార్త రాసిన రిపోర్టర్ భానుచందర్ రెడ్డి అక్రిడేషన్ ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
వార్త రాసే ముందు రిపోర్టర్ నిజానిజాలు నిర్దారణ చేసుకోవాలనటంలో ఎలాంటి సందేహాం లేదు. అదే సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతాయి. కానీ ఒక తప్పు దొర్లిందని..ఏకంగా రిపోర్టర్ అక్రిడేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది బహుశా ఇక్కడే అయి ఉండొచ్చు. మేడ్చల్ కలెక్టర్ నిర్ణయంపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే రద్దు చేసిన రిపోర్టర్ అక్రిడేషన్ ను పునరుద్దరించాలని డిమాండ్ చే్స్తున్నాయి.
Related Articles
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here