తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. ప్రస్తుతం టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ లో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి ఉండటం ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం కేవలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కోసమే అని టీడీపీ వర్గాల్లో సైతం ప్రచారం సాగుతోంది. అయితే కొంత మంది మాత్రం అలాంటిది ఏమీలేదని ఖండిస్తున్నా..ఇవాళ కాకపోయినా రేపు అయినా ఇదే జరుగుతుందని మాత్రం చెబుతున్నారు. సాక్ష్యాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే తెలంగాణలో పార్టీలో బలోపేతంపై ఏ మాత్రం దృష్టి సారించకపోవటంతో ఇక తమ దారి తాము చూసుకోవాలని చాలా మంది సీనియర్ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది. కొంత మంది నేతలు..బయటి వ్యక్తులు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తుకు ఏర్పాట్లు చేయటం చాలా మంది నేతలకు రుచించటం లేదు. అందులో రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉన్నారు.
Related Articles
అందుకే ఆయన తన మార్గం తాను చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. నవంబర్ 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్లోకి అధికారికంగా చేరతారని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఈ పరిణామాలు టీ టీడీపీలో ఎలాంటి మార్పులకు కారణం అవుతాయో. ఇఫ్పటికే గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కెసీఆర్ తన వైపు తిప్పుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ బాట పడితే..తెలంగాణలో తెలుగుదేశం ఉనికి మరింత ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతలేదన్నా..తెలంగాణలో కెసీఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కోగల నేత రేవంత్ రెడ్డి ఒక్కరే అన్న అభిప్రాయం చాలా మంది నేతల్లో ఉంది. అయితే కాంగ్రెస్ లో రేవంత్ కు ఏ మేరకు ఛాన్స్ వస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి.
The post కాంగ్రెస్ గూటికి రేవంత్ రెడ్డి! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here