హిందూ దీపం అనేది వెలుగును ప్రసాదిస్తుంది. మన హిందూ సంప్రదాయంలో దీపం అనేది జ్ఞాన చిహ్నం. హిందువులు ప్రతి రోజు ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారు. ఏదైనా కార్యాన్ని ప్రారంబించినప్పుడు దీపాన్ని వెలిగించటం ఆచారంగా ఉంది. శుభ కార్యాల్లో అయితే దీపం వెలిగించకుండా ఏ పని చేయరు. అలాగే మరణించిన తర్వాత కూడా తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే శవాన్ని చీకటిలో ఉంచకూడదు కాబట్టి దీపాన్ని వెలిగిస్తారు. మరి పగలు వెలుతురు ఉంటుంది కదా. పగలు కూడా దీపాన్ని వెలిగిస్తారు కదా. అవును దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
CLICKHERE : ఉప్పు ఎందుకు దొంగతనం చేయకూడదు?
మనం బ్రతికి ఉన్నప్పుడు దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో....అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా దీపం మోక్ష మార్గం చుపుతుందట. మరణించిన తర్వాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుండి బయటకు వస్తేనే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుంది.
CLICKHERE : మంగళ,శుక్ర వారాల్లో దానాన్ని ఎందుకు ఇవ్వకూడదు?
మరణించిన తర్వాత బ్రహ్మ కపాలం నుండి, శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ మోక్ష మార్గానికి వెళ్ళటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఉత్తర మార్గం,రెండోవాడి దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటుంది. ఉత్తర మార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తర మార్గం వైపుకు వెళ్ళటానికి దారి చూపిస్తుందట. తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహాయం చేస్తుంది. అందుకే మరణించిన తర్వాత తల దగ్గర దీపాన్ని పెడతారు.
CLICKHERE : గుడిలో ప్రదక్షణ ఎలా చేయాలి?
CLICKHERE : దేవాలయంలో తలనీలాలను ఎందుకు సమర్పిస్తారు?
CLICKHERE : గొబ్బిళ్ళు,ముగ్గుల వలన ప్రయోజనం ఏమిటి?