పుట్టపట్టికి సరిజోడు పుట్టపర్తి ..
అనేవారు నరాల రామారెడ్డి ..
తన అవధానాల ప్రారంభంలో ..
ఆ మాట అప్పట్లో ఒక నానుడి అయింది..
పుట్టపట్టి వాల్మీకి రామాయణాన్ని దర్శింపజేసి భారతీయ సాహిత్యాన్ని పునీతం చేశాడు.
అదే మాధురీ రస పంథాలో పుట్టపర్తి గారు
ఒక్క రామాయణమేమిటి .. ??
భాగవతమేమిటి..??
తెలుగు వారి ఇలవేలుపు శ్రీనివాసుని ప్రబంధమేమిటి..??
సాక్షాత్తూ సకల కళాధీశుడు శివుని తాండవాన్ని అమ్మలాస్యాన్ని దర్శించి దర్శింపజేసి..
తెలుగు భారతిని మహిమోపేతం చేశాడు..
20 వ శాతాబ్ది సర్వశ్రేష్ట భారతీయ కృతుల్లో శివతాండవమొకటి..
తెలుగు భాషకు చెందడం దాని దురదృష్టం..
మన మహాదృష్టం..
అలాగే ..
20 వ శతాబ్ది తెలుగునాట ఎల్లలెరుగని ప్రతిభామూర్తులలో
ఆయన వరిష్టుడు..
నిస్సీమా నిరంకుశ ప్రతిభా గరిష్టుడు..
గత వైభవానికి తావలమైన రాయలసీమలో కాక ..
అక్షర పరిశ్రమకు కేంద్రమైన
మధ్యాంద్రదేశంలో గనుక జన్మించివుంటే..
అక్కడి తెలుగే నేడు సకల జన ప్రామాణికమైనట్లు
వారే ..
సకలాంధ్రావనికి సర్వోన్నత మాన్యులై ఉండేవారు..
యావదాంధ్ర ప్రజ
మరెంతో మిన్నగా బ్రహ్మ రథం పట్టి ..
భారత పీఠంపై ఆ సరస్వతీపుత్రుని
ఎన్నడో ప్రతిష్టించి వుండేవారు..
-ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి
ద్రావిడ విశ్వ విద్యాలయం
Related Articles
This post first appeared on à°ªà±à°Ÿà±à°Ÿà°ªà°°à±à°¤à°¿ సాహితీ, please read the originial post: here