Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Three Indian Women were killed in US: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతిచెందారు. ఓ వ్యక్తి గాయపడినట్లుగా తెలుస్తోంది. మృతులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ కరోలినాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. వారంతా కూడా గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఓ కారులో భారతీయ మహిళలు ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కారురోడ్డు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్లడంతో ప్రమాదానికి గురైందని, ప్రమాద సమయంలో సుమారుగా గాల్లోకి 20 అడుగుల ఎత్తు మేరా లేచి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.

Also Read: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు..?

అయితే, ఈ ప్రమాదంపై అక్కడి అధికారి మాట్లాడుతూ.. వీరు ప్రయాణిస్తున్న వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణం చేతనే కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోందని చెప్పారు.

The post Three Indian Women were killed in US: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి appeared first on .

Share the post

Three Indian Women were killed in US: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×