Viral Video:ప్రమాదకరంగా 8 ఏళ్ల బాలుడు రైలు చక్రాల మధ్య ఇరుక్కుని వంద కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. చివరకు బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే బాలుడి ధైర్యానికి పలువురు ఆశ్యర్యపోతున్నారు.
లక్నో నుంచి హర్దోయ్కి వెళ్తున్న గూడ్స్ రైలు ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది.స్టేషన్ సమీపంలోనే ఉంటున్న 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. ట్రైన్ చక్రాల మధ్య కూర్చోగా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో ఏమీ చేయలేక అలాగే వంద కిలో మీటర్లు ప్రయాణించాడు.
రైలు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత హర్దోయ్ రైల్వేస్టేషన్కు చేరుకోగా..అక్కడ గూడ్స్ రైలును పరిశీలించిన ప్రయాణికులు అందులో బాలుడు ఉండడాన్ని గమనించారు. వెంటనే రైల్వే స్టేషన్లో ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు.
Also Read:నా రూటే సెపరేటు.. నామినేషన్ ఫైల్ చేసేందుకు ఒంటెపై వెళ్లిన ఎంపీ అభ్యర్థి
బోగీల మధ్యలో చక్రాల నడుమ కూర్చొని ఉన్న బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు ముఖానికి మొత్తం దుమ్ము, ధూళితో కనిపించాడు. అనంతరం ఆ బాలుడి వివరాలు తెలుసుకున్న అధికారులు చైల్డ్ కేర్ హోం కు తరలించారు. వంద కిలోమీటర్ల దూరం బాలుడు ప్రమాదకరంగా గూడ్స్ రైలుపై ప్రయాణించినట్లు తెలుసుకున్న పలువురు బుడ్డోడి గుండె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.
मालगाड़ी के पहियों के बीच बैठकर हरदोई पहुँचा बच्चा
आरपीएफ़ ने किया रेस्क्यू
रेलवे ट्रैक के किनारे रहने वाला है मासूम
खेलते खेलते ट्रैक पर खड़ी मालगाड़ी पर चढ़ा
मालगाड़ी चल दी और बच्चा नहीं उतर पाया
रेलवे सुरक्षा बल के जवानों ने बच्चे को उतारा
बच्चे को चाइल्ड केयर हरदोई के… pic.twitter.com/D8A1Xqbbho
— News1Indiatweet (@News1IndiaTweet) April 21, 2024
The post Viral Video: అరే బుడ్డోడా ఏం గుండె రా నీది..వీడ్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. appeared first on .
This post first appeared on "BIG TV - తెలà±à°—à± Breaking News | 24X7 Live News Updates à°¨à±à°¯à±‚సౠఛానలà±", please read the originial post: here