సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17వ తేదీల్లో తిరుపతి ఎస్వీ ఆడిటోరి యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరు పతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లా ల్లోని నిరుద్యోగ యువత కోసం తిరుపతిలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి మార్గాలను చూపేందుకు ఈ జాబ్ మేళా దోహదపడుతుందన్నారు.