ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(ఏపీఎస్ సీహెచ్ ఈ) - ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఈఏపీసెట్) 2022 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిని అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ) నిర్వహిస్తోంది.
Related Articles
ఈ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ(అగ్రికల్చర్/ హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎస్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మాడీ ప్రోగ్రామ్ లలో ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్స్ కోసం Website చూడవచ్చు. అర్హత: నిర్దేశిత మార్కులతో మేథమెటిక్స్/బయాలజీ, ఫిజిక్స్, కెమిస్టీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిప్లొమా/ ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసినవారు; ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏపీ సెట్: దీనిని ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్టీమ్లు ఉద్దేశించిన పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టీమ్స్ లో కూడా 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. బోటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడు గుతారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. ఈ టెస్లో అర్హత పొందాలంటే కనీసం 25 శాతం మార్కులు రావాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, బీసీ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500, \
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 మే 10
ఏపీ ఈఏపీసెట్ 2022 తేదీలు: 2022 జూలై 4 నుంచి 12 వరకు
• వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in