వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు జీవితంలో స్థిరపడాలి అనే ఉద్దేశ్యంతో కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక వెబ్సైట్ ను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్సైట్ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Related Articles
తొలి విడతలో కనీసం 15 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించారు. ఈ నెల 16, 17 తేదీల్లో తిరుపతిలో.. ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో.. ఈ నెల 30, మే 1వ తేదీల్లో గుంటూరులో వైసీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వైసీపీ కార్యకర్తలు https://ysrcpjobmela.com/ వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తున్న చేసుకోవచ్చారు.