ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద 1,852 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. బుధవారం అమరావతి సచివాల యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. "ఆర్టీసీలో పని చేస్తూ 2015కి ముందు 385 మంది మృతి చెందారు. 2019లోనే వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీలోనే కారుణ్య నియామకాలు జరిగాయి. 2016 జనవరి నుంచి 2019 మేలో జగన్ అధికారంలోకి వచ్చేనాటివరకు 896 మంది ఆర్టీసీ కార్మికులు మర ణించారు. అలాగే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశాక.. 2020 జనవరి1 నుంచి 956 మంది చనిపోయారు. ఈ మొత్తం కలిపి 1,852 కుటుంబా లకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మరణిం చిన ఆర్టీసీ ఉద్యోగి ఏ జిల్లాకు చెందిన వారైతే అదే జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది" అని మంత్రి చెప్పారు. కొవిడ్ కారణంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు నిలుపుదల చేసిన 25% రాయితీని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామన్నారు.