ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్).. మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Related Articles
» మొత్తం పోస్టుల సంఖ్య: 25
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 2022 సెప్టెంబర్ 30 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 200మార్కులకు నిర్వహిస్తారు.దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమా ధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు లకు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2022
» రాతపరీక్ష: 2022, ఏప్రిల్ లో నిర్వహిస్తారు.
" వెబ్ సైట్: www.eximbankindia.in