నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Related Articles
ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు NTPCకోల్ మైనింగ్ సైట్ల వద్ద శిక్షణ పొందుతారు.
మొత్తం ఖాళీల వివరాలు:- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 డిప్లొమా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు
ఖాళీల వివరాలు:
పోస్టు: డిప్లొమా ఇంజనీర్
మొత్తం ఖాళీలు: 70
మైనింగ్:40
మెకానికల్: 12
ఎలక్ట్రికల్: 10
మైన్ సర్వే: 08
వేతనం:- ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు NTPCకోల్ మైనింగ్ సైట్ల వద్ద శిక్షణ పొందుతారు. ఆ సమయంలో వారికి నెలకు రూ. 24 వేలు ఉపకారవేతనంగా అందిస్తారు.
అర్హత :- సంబంధిత సబ్జెక్టుల్లో 70శాతం మార్కులతో డిప్లొమా పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పరీక్ష ఫీజు :- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 300 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.
ఇతర వివరాలను నోటిఫికేషన్ లో పొందుపరిచారు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభమైంది. డిసెంబర్ 12న దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Notification :; https://www.ntpc.co.in/en/careers