ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8000 వరకు ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 8000 పోస్టుల భర్తీ జరుగుతుంది.
Related Articles
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES హెడ్ క్వార్టర్స్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి స్కోర్ కార్డ్ లభిస్తుంది. ఈ స్కోర్ కార్డ్ జీవితాంతం వేలిడ్లో ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్టుల వివరాలు:-
1) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT,
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT,
3) ప్రైమరీ టీచర్-PRT
విద్యార్హతల వివరాలు:- పీజీటీ పోస్టుకు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బీఈడీ కూడా 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇక టీజీటీ పోస్టుకు ఏదైనా డిగ్రీలో, బీఈడీలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇక పీఆర్టీ పోస్టుకు 50 శాతం మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో పాటు బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సీటెట్ లేదా టెట్ అవసరం లేదు. అభ్యర్థుల వయస్సు ఫ్రెషర్స్కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ.500.
ముఖ్యమైన తేదీలు:- అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 20 చివరి తేదీ. అడ్మిట్ కార్డులు 2020 నవంబర్ 4న విడుదలౌతాయి. ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలనుకునేవారికి రిజిస్ట్రేషన్ పోర్టల్లో 2020 నవంబర్ 4 నుంచి నవంబర్ 13 వరకు లింక్ అందుబాటులో ఉంటుంది. 2020 నవంబర్ 21 లేదా 22 తేదీల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు 2020 డిసెంబర్ 2న విడుదలౌతాయి.
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయు విధానం:-
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను http://aps-csb.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.