నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సినిమా, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఈ దసరాకి విడుదల అయ్యాయి. అయితే ఈ మూడింటిలో దసరా విన్నర్ ఏదో చూసేద్దాం. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు అయితే ఫ్యాన్స్ కేరింతల కొడుతున్నారు. బాలకృష్ణను మునుపెన్నడు చూడని విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. శ్రీ లీల , బాలయ్య మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్స్ కైతే ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.
Related Articles
మరో పక్క తమిళ్ డబ్బింగ్ సినిమా లియోకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో జనం పోటెత్తడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి ఏకైక కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజుగా చెబుతున్నారు. ఆయన ఇంతకుముందు డైరెక్ట్ చేసిన విక్రమ్, ఖైదీ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అవడం దీనికి కారణం. ఆ సినిమాలకు లియో సినిమాలకు లింక్ ఉందనే టాక్ రావడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అయితే రెండో రోజు ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా పడిపోయాయి. దీనికి కారణం మొదటి రోజు సినిమా చూసిన వాళ్ళు అంతా ఈ సినిమా అంతగా బాగాలేదు అని చెప్పడం.
ఇది ఇలా ఉంటె..భగవంత్ కేసరికి రెండో రోజు కలెక్షన్స్ బాగా పెరిగాయి. ఎమోషన్స్ బాగా ఉండడంతో ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి టికెట్స్ సులభంగా దొరికినప్పటికీ రెండో రోజు ఫుల్ అయ్యాయి.
ఇక రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” విషయానికి వస్తే…సినిమా అంతా సీరియస్ గా సాగుతుంది. వయోలెన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో ఫామిలీ ఆడియన్స్ అంతా ఇంటరెస్ట్ చూపించట్లేదు. మరోపక్క సినిమా కూడా సాగదీసినట్టుగా ఉంది. పాటలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇలా లియో, టైగర్ నాగేశ్వర రావు నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో…మరో పక్క “భగవంత్ కేసరి” పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండడంతో ఈ దసరాకి విన్నర్ “భగవంత్ కేసరి”నే. తొలిరోజు రూ.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది బాలయ్య సినిమా.
The post ఈ ముగ్గురిలో “దసరా” విన్నర్ ఎవరు.? రెండో రోజుకి లెక్కలు మారిపోయాయిగా.? appeared first on Prathi Dvani - The Sound of Every Telugu Heart Beat.