ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనుదర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ సినిమా సరైనోడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై నిర్మించారు.
Related Articles
ఈ మూవీలో కేథరిన్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో హాస్యనటి విద్యుల్లేఖ నటించిన ఒక సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2016లో రిలీజ్ అయిన సరైనోడు మూవీకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత మాస్ ఆడియెన్స్ వల్ల ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా అప్పట్లో అల్లుఅర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ వదిన పాత్రలో హాస్యనటి విద్యుల్లేఖ రామన్ తమిళంకు చెందిన అమ్మాయిగా నటించింది. ఆమె ఒక సీన్ లో బామ్మతో సాంబార్ తో స్నానం చేస్తే మంచి కలర్ వస్తుంది అని చెప్తుంది.
అయితే ఈటీవీలో ప్రసారం అవుతున్న మౌనపోరాటం అనే సీరియల్ లో ఒక సన్నివేశంలో ఒక నటి, సాంబార్ గిన్నె తీసుకుని తనపై పోసుకుంటుంది. ఇక ఈ రెండు సీన్స్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తో పాటు జల్సా మూవీలో ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ నేను సీరియస్ గా తీసుకున్నాను అనే చెప్పే వీడియోను కూడా కలిపి రూపముగ్గల్ల అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
రూపముగ్గల్ల సీరియల్ నటి. ఈటీవీలో అభిషేకం, యమలీల మళ్ళీ మొదలైంది వంటి పలు సీరియల్స్ లో నటించి, మంచి గుర్తింపును తెచ్చుకుంది. మౌనపోరాటం సీరియల్ లో రూప నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించినట్టు తెలుస్తోంది. మౌనపోరాటం సీరియల్ లో సాంబార్ తన పై పోసుకున్న నటి కూడా రూపనే. ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: “సమ్మోహనుడా” పాట లాగే “రూల్స్ రంజన్” సినిమా కూడా హిట్ అయ్యిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
The post ఇదేందయ్యా ఇది.. సరైనోడులో సరదాగా అంటే.. ఈ సీరియల్ లో నిజం చేసారుగా..? appeared first on Prathi Dvani - The Sound of Every Telugu Heart Beat.