Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

CM Ramesh: చిరంజీవి ని సాంతం వాడేసిన సీఎం రమేష్

CM Ramesh: గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ చిరంజీవి కోసం చేసిన ప్రయత్నాలు సైతం పెద్దగా వర్కౌట్ కాలేదు. నేరుగా ప్రధాని మోదీ కబురు పంపినా సున్నితంగా చిరంజీవి తిరస్కరించారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే చిరంజీవి పేరు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రమేష్ చిరంజీవిని కలిసిన తరువాత సీ న్ మారింది. ఆయనను వైసీపీ టార్గెట్ చేసుకోవడం ప్రారంభించింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వచ్చింది. చిరంజీవి అభిమానులు దూరమవుతారని భావించి వైసిపి యూటర్న్ తీసుకుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అందరూ చిరంజీవిని వాడుకోవాలని ప్రయత్నాలు చేయడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల సీఎం రమేష్ తో పాటు పంచకర్ల రమేష్ బాబు కలిశారు. సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పెందుర్తి అసెంబ్లీ సీటు నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలో ఉన్నారు. ఇందులో పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలు ప్రారంభించారు. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి ఆయన రాజకీయ గురువు.పైగా ఇప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ సీఎం రమేష్ చిరంజీవికి ఎలా సన్నిహితుడు అన్నది ఇప్పుడు ప్రశ్న.

చిరంజీవితో పాటు సీఎం రమేష్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.చిరంజీవి కాంగ్రెస్ నుంచి,సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇద్దరూ ఒకేసారి ప్రమాణం చేశారు. అప్పటినుంచి తోటి రాజ్యసభ సభ్యుడిగా సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే గత పది సంవత్సరాలు లేని వారి మధ్య సన్నిహిత్యం.. ఇప్పుడే వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం మూడు పార్టీలు కూటమి కట్టిన నేపథ్యంలో బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు బిజెపి కంటే తెలుగుదేశం పార్టీతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలో పవన్ ను తీసుకొచ్చి అనకాపల్లిలో ప్రచారం చేయించారు. తరువాత చిరంజీవిని నేరుగా కలిశారు. ఆయన మద్దతు పొందగలిగారు. దీనినే వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. బిజెపితో టిడిపి పొత్తు వెనుక సీఎం రమేష్ ది ప్రధాన కృషి. ఇప్పుడు అదే సీఎం రమేష్ చిరంజీవిని వాడుకోవడం వైసిపి తట్టుకోలేకపోతోంది. చిరంజీవి అభిమానులు అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో అధికం. వారి ఓట్లు గుంప గుత్తిగా పడాలంటే చిరు పిలుపు కీలకం. అందుకే సీఎం రమేష్ ప్లాన్ చేశారు. ఒక వ్యూహం ప్రకారం చిరంజీవిని కలిసి మద్దతు పొందారు. చిరంజీవిని అమాంతం వాడేసారు అని రాజకీయ ప్రత్యర్థులు కలవరపాటుకు గురవుతున్నారు. చిరంజీవి వెనుక ఈ రాద్ధాంతం ఉద్దేశపూర్వకంగానే చేశారన్నది బహిరంగ రహస్యం.

Share the post

CM Ramesh: చిరంజీవి ని సాంతం వాడేసిన సీఎం రమేష్

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×