పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్-నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారట. 2007లో యోగి సినిమాలో జంటగా నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనువిందు చేయబోతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు కలిసి నటించనున్న ఆ సినిమా ఏంటో తెలుసా..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రీసెంట్గా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో మెరవనున్నారని,
అది కూడా శివుడి పాత్రలో కనిపించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్తో దీన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఇదే మూవీలో ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించబోతుందట. ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా పార్వతిగా నయన్ కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్-నయనతార.. యోగీ సినిమా తర్వాత అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది..!!
Related Articles
The post Prabhas and Nayanthara likely to reunite after 16 years! appeared first on Telugu Swag.