ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరకట్టలో కట్టిన అక్రమాల నివాసాలపై చర్చజరిగిన సందర్భంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. తామిద్దరం మంత్రులుగా ఒకే గదిలో ఉన్నామని తెలిపారు. అలాంటిది తనకు రాజశేఖరరెడ్డి విగ్రహాలపై కడుపు మంట ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తనకు రాజశేఖరరెడ్డితో రాజకీయపరమైన విభేదాలే తప్ప..వ్యక్తిగత వైరుధ్యాలు ఏమీలేవని వ్యాఖ్యానించారు.
Related Articles
జగన్ ఇప్పుడు అక్రమ నిర్మాణాల గురించి తెగ మాట్లాడుతున్నరని..ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ విగ్రహలు పెట్టించలేదా? అని వ్యాఖ్యానించారు. కేవలం తాను అడిగాననే కారణంతోనే ప్రజావేదికను కూల్చివేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జి మెంట్ ప్రకారం దాన్ని కూల్చాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినా తాను ఉంటున్నది రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లు అని..తాను అద్దెకు మాత్రమే అక్కడ ఉంటున్నట్లు తెలిపారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here