తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఐరోపా దేశాల పర్యటనకు వెళ్ళినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన విదేశీ పర్యటన ఈ నెల ప్రారంభంలోనే తలపెట్టినా అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారు.ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మంగళవారం తో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Related Articles
ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత విశ్రాంతి కోసం ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. వాస్తవానికి అన్ని పార్టీల అధినేతలతో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోడీ సమావేశం తలపెట్టారు. దీనికి చంద్రబాబు హాజరుకాకుండా..పార్టీ అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here