తెలుగుదేశంఎంపీ కేశినేని నాని తన తిరుగుబాటు బావుటానుఎగరేస్తూనే ఉన్నారు. నిను వీడను నీడను నేనుఅంటూ నిత్యం ఫేస్ బుక్ పోస్టులతో టీడీపీలో కలకలం రేపుతున్నారు. గత వారం రోజులుగా నాని ఫేస్ బుక్ వేదికగా హంగామా చేస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి మరింత చికాకు వ్యవహారంగా మారింది. తన దాడి కొనసాగింపులో భాగంగా బుధవారం నాడు కూడా నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ‘నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.
Related Articles
మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.’ అనే పోస్ట్ను షేర్ చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరుగుబావుట ఎగరవేసిన నాని.. కొద్ది రోజులుగా సోషల్మీడియా వేదికగా వరుస పోస్ట్లతో తమ పార్టీనేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు తన తడాఖా చూడండి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here