రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలోకి మరో కీలక వ్యక్తి ప్రవేశించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి ఇంటికి పిలిచి మరీ పాత్ర చేయమని కోరటంతో వెంటనే ఓకే చేసినట్లు తెలిపారు. ఆయనే ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని. ఈ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా ముందుకు సాగుతున్నా ఇఫ్పటివరకూ హీరోయిన్ల పేర్లు ఏవీ అధికారికంగా వెల్లడికాలేదు. సినిమా నిర్మాణ దశలో ఉండగానే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ 130 కోట్ల రూపాయలకు అమ్ముడపోయిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Related Articles
రాజమౌళి సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి రెండు భాగాలు దేశంలోనే పలు ‘రికార్డులు’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికి తోడు దర్శకుడుర రాజమౌళి కావటం మరో కీలకాంశం. ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అయితే..ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here