తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతానని ప్రకటించారు. అంతే కాదు..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని తాను కూడా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఫలితాలు వెల్లడి అయ్యాక తన ఫోన్లు పగిలిపోయేలా ఏపీ నుంచి మెసేజ్ లు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేసినట్లే తాను కూడా ఏపీకి వెళ్లి పనిచేయవద్దా? అని వ్యాఖ్యానించారు.
Related Articles
చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ తాను తిరిగి ఇవ్వకపోతే తెలంగాణ వాళ్ళకు సంస్కారం లేదనుకునే అవకాశం ఉందన అన్నారు. తాను ఎవరు వైపు ఉంటానో చెప్పాలని డిమాండ్ చేయటానికి అసలు చంద్రబాబు ఎవరు? అని కెసీఆర్ ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు పరిస్థితే సరిగాలేదని..రాబోయే రోజుల్లో చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలు బయటపెడతానని వ్యాఖ్యానించారు. నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోడీని హద్దులు దాటి ప్రశంసించి చంద్రబాబు అభాసుపాలు అయ్యారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని..అవి త్వరలోనే బహిర్గతం చేస్తానని చెప్పారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here