హరికృష్ణ గురించి ఆయన తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఓ సందర్భంలో చెప్పిన మాటల వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇఫ్పుడు వైరల్ అవుతోంది. హరికృష్ణలా ఏ తనయుడు తన తండ్రికి సేవ చేయరని..చేయలేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు ఆయన తనయుడిగా హరికృష్ణ అందించిన సేవలు అలాంటివి అన్నారు. తాము ఇప్పుడు తమ తండ్రి హరికృష్ణకు అలాంటి సేవలు ఏ మాత్రం చేయలేకపోతున్నామని..సినిమాలు..వ్యాపారాలు అంటూ తిరుగుతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కోసం లక్ష కిలోమీటర్లు చైతన్యరథం నడిపిన వ్యక్తి హరికృష్ణ అని తెలిపారు. ఇఫ్పుడు అలాంటి రథాన్ని ఎవరైనా నడుపుతారా? అని ప్రశ్నించారు. అది జరిగే పనికాదని తేల్చేశారు.
Related Articles
అలాంటి రథాన్ని ఇఫ్పుడు ఎవరైనా నడపాలంటే కాళ్లు..నడుము పడిపోతాయని అన్నారు. ఓ సారి ఢిల్లీలో సమావేశం ముగించుకుని వస్తూ..హరికృష్ణను రైల్వే స్టేషన్ కు రావాలని కోరగా..ఆయన 900 కిలోమీటర్లు వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు తాము తన తండ్రిని చూడలేదని..ఎన్టీఆర్ ఆ రోజుల్లో మూడు గంటలకే నిద్ర లేచే వారని..ఆయన లేచే సమయానికి హరికృష్ణ వెళ్లిపోయేవారని..తాము నిద్రపోయాక ఇంటిక వచ్చేవారని తెలిపారు. నాన్నకు ప్రేమతో సినిమా ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ భావోద్వేగంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here