పవన్ కళ్యాణ్ వల్ల టీవీ ప్రేక్షకులకు ఏమైనా మేలు జరిగిందా?. అంటే ఖచ్చితంగా కొంత ఊరట లభించిందనే చెప్పొచ్చు. రోజుల తరబడి శ్రీరెడ్డి…సినిమా నటులతో రోజులకు రోజులు..గంటలకు గంటలు చర్చలు జరిపిన చానెళ్ళు పవన్ కళ్యాణ్ ఎటాక్ తో కాస్త విరామం ప్రకటించినట్లు కన్పిస్తున్నాయి. లేదంటే ఈ ఎపిసోడ్ అలా ‘సాగి’పోతూ ఉండేది. ఎందుకంటే సహజంగానే సినిమాకు సంబంధించిన అంశాలు అంటే చాలు..ఎక్కువ మంది చూస్తారు. రేటింగ్ లు వస్తాయి. కావాలంటే కొన్నిఛానళ్ళు మరింత మసాలా జోడించి మరీ చర్చను రక్తికట్టించే ప్రయత్నం చేస్తాయి. గత కొంత కాలంగా అదే సాగుతోంది. అయితే శ్రీరెడ్డి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇది పీక్ కు చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు..గతంలో ఎప్పుడూలేని విధంగా..మీడియాపై డైరక్ట్ ఎటాక్ కు దిగాడు.
Related Articles
ఏకంగా కొంత మంది మీడియా అధిపతుల వ్యక్తిగత అంశాలపై కూడా ట్విట్టర్ వేదికగా ఎటాక్ ప్రారంభించారు. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి అంశం పక్కకు పోయినట్లు అయింది. ఈ కారణంగానే టీవీల్లో వేరే వేరే అంశాలపై చర్చలు ప్రారంభం అయ్యాయి. కొన్ని ఛానళ్లు మాత్రం శ్రీరెడ్డి ఎపిసోడ్ లో ఎంత వరకూ చెప్పాలో..అంతే చెప్పి వదిలేశాయి. మరికొంత మంది మాత్రం అదే పనిగా రోజుల తరబడి…అసలు రాష్ట్రంలో..దేశంలో చర్చనీయాంశాలేమీలేవు..శ్రీరెడ్డి తప్ప అన్నంత రేంజ్ లో నడిపించారు. మొత్తానికి రాజకీయ అంశాలు ఎలా ఉన్నా…పవన్ కళ్యాణ్ టీవీ ప్రేక్షకులకు మాత్రం ఊరట కల్పించారు. శ్రీరెడ్డి ఇంకా తన ఫేస్ బుక్ పై పోస్టులు పెడుతున్నా..వాటిని చిన్న చిన్న వార్తలతోనే సరిపుచ్చేస్తున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here