ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఇఫ్పటికే పూర్తయింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన డిజైన్లను కూడా మంత్రివర్గ సభ్యులకు సూచించి..వారి సలహాలు అడిగారు. రాజధాని ప్రాంతంలో 108 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని నీరుకొండ వద్ద ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
Related Articles
తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్కు అభిముఖంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. తాజాగా ఆ ప్రాంతాన్ని మార్చి నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉంటుంది. ఈ కొండపైనే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, కన్వెన్షన్ కేంద్రాలు, గ్రంథాలయం, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనాల ఏర్పాటు చేయనున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here