Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది..ఇది యనమల మాట

ఇది ఎవరో ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కాదు. సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్న మాట. ఆయన గురువారం నాడు అమరావతిలోని సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16వేల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వివరించారు. మరోవిడత రుణం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు.                               వర్క్ కాంట్రాక్ట్స్ పై జీఎస్టీ 12 శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.600 నుంచి రూ.700 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు.

                          రైతు రుణమాఫీకి రూ.3 వేల కోట్లు, డ్వాక్రా గ్రూపులకు రూ.2వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీ, రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్, డ్రింకింగ్ వాటర్, ఏపీయుఐడీసీ, రోడ్ల అభివృద్ధి, పవర్ ఫైనాన్స్… వంటి కార్పోరేషన్లకు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆ కార్పోరేషన్లు స్వతంత్రంగా రుణం తీసుకుంటే బ్యాంకులు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తాయని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తక్కువ వడ్డీ వసూలు చేస్తాయని, అందువల్ల ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్లు మంత్రి వివరించినట్లు ఓప్రకటనలో తెలిపారు.

The post ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది..ఇది యనమల మాట appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది..ఇది యనమల మాట

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×