Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జియో కస్టమర్లకు శుభవార్త

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్లు వస్తున్నాయి. ఈ మేరకు జియో కస్టమర్లకు రిలయన్స్ ఓ శుభవార్త అందించింది. ఇప్పటికే ఫోన్లు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 21 నుంచి రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను సప్లై చేస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. వారం రోజుల్లో 50 లక్షల కేంద్రాల ద్వారా ఫోన్లు సప్లై చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు.    ఆగస్టు 24న ప్రారంభమైన రిలయన్స్ జియో ప్రీ బుకింగ్స్ ఫోన్లకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

                          ఒక్క రోజులోనే 60 లక్షల మంది వినియోగదారులు 4జీ ఫీచర్ ఫోన్లను బుక్ చేసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో జియో ఫోన్ ప్రీ బుకింగ్స్ నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ల కోసం కోటి మంది వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నారు. త్వరలోనే మళ్ళీ ఈ ఫోన్ బుకింగ్స్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంది.

The post జియో కస్టమర్లకు శుభవార్త appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

జియో కస్టమర్లకు శుభవార్త

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×