ఆ అమ్మాయి చదివేది పదో తరగతే. కానీ ఆ ప్రాంతానికి చెందిన యువకులు ఆమెను అటకాయించి..పొలాల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతే కాదు..విషయం ఎక్కడి బయటికి చెబుతుందో అని భయపడి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విజయ నగరం జిల్లా గాదెల వలసలో ఈ దారుణ ఘటన జరిగింది. బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను ఆపి భయపెట్టాడు. పక్కన ఉన్న మామిడితోటలోకి బాలికను తీసుకెళ్లి సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజతో కలసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత హత్య చేసి..మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు.
Related Articles
స్కూల్ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
The post గ్యాంప్ రేప్ కు గురైన టెన్త్ క్లాస్ అమ్మాయి appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here